కత్తి రంగు
అవంతీపురాన్ని జయసేనుడు పరిపాలించాడు. పొరుగు రాజ్యమైన కౌసల్యను రణదీపుడు పాలించేవాడు. వారిద్దరి రాజవంశాల మధ్య తరతరాల నుండి శత్రుత్వం వుంది. ప్రతి చిన్న విషయానికి కత్తులు దూసేవారు.
రెండు రాజ్యాల మంత్రులు వీరి చేష్టలకు విసిగిపోయారు. ఒక రోజు, వారు సమావేశమై వారి రాజుల మధ్య వైరాన్ని తొలగించేందుకు ఒక ఉపాయం ఆలోచించారు. దాని ప్రకారం రాజులకు రెండు దేశాల సరిహద్దు వద్ద వున్నా పెద్ద చెట్టు దగ్గరకు తీసుకుని రవళి. సమావేశం రోజు ఉదయం ప్రధానమంత్రులిద్దరూ చెట్టు కొమ్మకు ఒక కత్తి ఒరను వేలాడదీశారు.
అనుకున్న సమయానికి ఇద్దరు రాజులూ ఆ చెట్టు దగ్గరికి చేరుకున్నారు. కొద్ది దూరం నుండే ఒకరినొకరు చూసుకుని మొహాలు చిట్లించుకుని, వేలాడుతున్న ఒరను చూసారు.
జయసేనుడు పరవశుడై ఇలా అన్నాడు "ఆహ! ఎంత అద్భుతమైన ఒర! వజ్రవైడూర్యాలు ఈ ఎర్రటి ఒరను మరింత అమూల్యమైనదిగా మార్చాయి."
బదులుగా రణదీపుడు "ఏం మాట్లాడుతున్నావ్? ఇది నిస్సందేహంగా అమూల్యమైనదే. కానీ ఇది తెలుపురంగుది నీవు చెప్పినట్లు ఎరుపురంగుది కాదు."
జయసేనుడు కరుకైన స్వరంతో, "నీవు అబద్ధాలు మాట్లాడుతున్నావు. నేను చూస్తున్నాను కదా! అది ఎరుపు రంగుదే" అని అరిచాడు.
రణదీపుడు కూడా సహనాన్ని కోల్పోయి "నీవు గుడ్డివాడివనుకుంటా. ఒర తెల్లగా వుంది, తెలుపు ముత్యాలు పొదగబడి వుంది" అన్నాడు.
"నువ్వు నన్ను ఇక్కడకు కేవలం యుద్ధానికే పిలిచావనుకుంటా" జయసేనుడు తన కత్తి బయటకు లాగాడు. రణదీపుడు కూడా అంతే వేగంగా కత్తి బయటకు తీసాడు. ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడానికి ముందుకు దుమికారు. అంతే, పక్కనే పొదల మాటున దాక్కున్నా వారి ప్రధానమంత్రులు బయటకు వచ్చి ఇలా అన్నారు. "ఓ రాజుల్లారా! ఆగండి! పోట్లాడే ముందు అన్ని అంశాలు పరిగణనలోకి తీసుకోవాలి.
"మీరు ఈ కత్తిని రెండు వైపుల నుండి చూడవలసింది. మీరిద్దరూ నిజమే చెబుతున్నారు. ఈ ఒర ఒకవైపు ఎరుపుగా మరోవైపు తెల్లగా వుంది."
"నిజమా!" రాజులు ఆశ్చర్యపోయారు.
ప్రధానమంత్రులు ఇంకా ఇలా చెప్పసాగారు. "ఇప్పటి కత్తి విషయంలో జరిగినట్టు, యుద్ధాలు, సమరలు అనేవి అపార్ధాలకు పర్యవసానాలు."
ఇద్దరు రాజులూ వారి తప్పులను తెలుసుకొని సఖ్యతగా ఉండేందుకు చేతులు కలిపారు.
No comments:
Post a Comment