పట్టుబడిన నటుడు
రవివర్మ ఆస్థానంలో గణపతిశాస్త్రి అనే మంత్రి ఉండేవాడు. ఆయన చాలా తెలివైనవాడు. తెలివి, సమయస్ఫూర్తితో ప్రజల వివాదాలను తీర్చేవాడు.
ఒకరోజు భీమసేనుడనే వర్తకుడు గణపతిశాస్త్రి వద్దకు వచ్చి "అయ్యా! నేను సుధనుడనే నటుడికి కష్టకాలంలో ధనమిచ్చి సహాయం చేశాను. ఇప్పుడు అతను స్థితిమంతుడయ్యాడు. నేను నా అప్పు తీర్చమని చాలాసార్లు వాళ్ళ ఇంటికి వెళ్లి అడిగాను. కానీ విచిత్రమేమిటంటే నేను వాళ్ళింటికి వెళ్ళినప్పుడల్లా అతనిని పోలిన ఐదుగురు వ్యక్తులు కనిపిస్తారు. ఎవరిని పలకరించిన నేను సుధనుడు కాదంటే నేను కాదని అంటున్నారు. ఎవరిని ధనం అడగాలో తెలీడం లేదు" అన్నాడు.
గణపతిశాస్త్రికి ఈ విచిత్రమైన సమస్య పట్ల కుతూహలం కలిగింది. మరునాడు భీమసేనుడితో సుధనుడి ఇంటికి వెళ్ళాడు. అక్కడ సుధానుని పోలిన నలుగురు ఒకే వేషధారణతో వున్నారు.
గణపతిశాస్త్రి "మీ అందరి వేషధారణ చాల బాగుంది. అందరు ఒకేలా వున్నారు. మీలో సుధనుడేవరో కనిపెట్టడం చాలా కష్టమే. కాకపోతే ఒక చిన్న తప్పు చేసారు. ఆ తేడా వాళ్ళ కనిపెట్టడం కష్టం కాదు అన్నాడు.
ఆ మాటలు విన్న నిజమైన సుధనుడికి తాను వేయించిన వేషధారణలో చేసిన తప్పేమిటో తెలుసుకునే ఆత్రుత కలిగింది. వెంటనే "తప్పా! ఎక్కడ? ఏం తేడా కనిపిస్తుంది?" అని అడిగాడు.
గణపతిశాస్త్రికి వెంటనే సుధనుడు ఎవరో తెలిసిపోయింది. "నువ్వేగా నిజమైన సుధనుడివి" చిన్నగా నవ్వుతూ అడిగాడు. సుధనుడు అవునన్నట్లు తలూపాడు. తమ పనితనం గురించి తప్పు పట్టినప్పుడు ఆ తప్పేమిటో తెలుసుకునే ఆత్రుత ఎవరికైనా ఉంటుంది. ఆ మెలికను కనిపెట్టి గణపతిశాస్త్రి సుధనుడు ఎవరో గుర్తుపట్టాడు. భీమసేనుడికి ధనాన్ని తిరిగి ఇప్పించాడు.
No comments:
Post a Comment