Friday, January 6, 2023

ముందు చూపు - Foresight

 

ముందు చూపు

చంద్రపురి రాజ్యాన్ని విక్రమవర్మ అనే రాజు పరిపాలించేవాడు. విక్రమవర్మ ఒక రోజు తన మంత్రితో రాజ్యంలో సంచారం చేస్తూ ఒక తోట దగ్గరకు వచ్చాడు. 

అక్కడ ఆయనకు ఒక వృద్ధుడు కనిపించదు. ఆ వృద్ధుడి వయస్సు ఎనభై సంవత్సరాలకు దగ్గరగా ఉంటుంది. వణికే చేతులతో ఆయన ఒక మామిడి మొక్కను నాటుతున్నాడు. 

విక్రమవర్మ ఆ ముసలి తాతను ఉద్దేశించి "తాతా ! ఈ తోటలో నువ్వు పని చేస్తున్నావా? లేక ఇది నీ సొంత భూమా? " అని అడిగాడు. 

దానికి ఆ వృద్ధుడు "మహారాజా! ఇది నా తాత ముత్తాలనాటి  భూమి" అన్నాడు. విక్రమవర్మ "మరి అంత కష్టపడి మామిడి మొక్కను నాటుతున్నావేం? నువ్వు ఇప్పుడు నాటిన మామిడి మొక్క పెరిగి చెట్టై పండ్లు కాయడానికి చాల సంవత్సరాలు పడుతుంది. ఆ పండ్లను తినడానికి నువ్వు బతికుంటావనే నమ్మకం నీకుందా?" అని అడిగాడు చిన్నగా నవ్వుతూ. 

దానికి ఆ ముసలితాత "నేను ఇన్ని రోజులూ నా తాత ముత్తాతలు నాటిన చెట్ల పండ్లను తిన్నాను. నేను నాటిన చెట్ల పండ్లను నా తరువాత తరం వారు తింటారు. మనం నాటిన చెట్ల పండ్లను మనమే తినాలి అనుకోవడం స్వార్థమవుతుంది" అన్నాడు. 

విక్రమవర్మ ఆ సమాధానికి సంతోషించాడు. ఆ ముసలి తాతను తన భవనానికి పిలిచి సత్కరించాడు. 

No comments:

Post a Comment